ప‌లుచోట్ల భారీ వ‌ర్షం

ఆదిలాబాద్ జిల్లాలో ప‌లుచోట్ల భారీ వ‌ర్షం కురిసింది. ఈ వ‌ర్షం ధాటికి చేతికొచ్చే స్థితిలో ఉన్న‌ పంట నేల‌పాలైంది. కుమురం భీం జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్‌లో  ఓ మోస్తారు వ‌ర్షం కురిసింది. కాగ‌జ్‌న‌గ‌ర్ ప‌ట్టణంలోని కౌస‌ర్ న‌గ‌ర్ వార్డు నెంబ‌ర్ 9లో ఓ భ‌వ‌నంపై పిడుగు ప‌డింది. దీంతో స్థానికులు భయాందోళ‌న‌కు గుర‌య్యారు. పిడుగు పాటుతో భ‌వ‌నం గోడ ప‌గిలిపోయింది. పిడుగుపాటుతో ప్రాణ న‌ష్టం లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆస్తి న‌ష్టం జ‌రిగింది.