ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతికత బృందాన్ని అభినందించిన డీజీపీ

 


ఏపీ 


ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతికత బృందాన్ని అభినందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ 


కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు సీఎం వై.యస్.జగన్ సారథ్యంలో పోలీసు శాఖ అన్ని చర్యలను తీసుకొంటోంది-డీజీపీ 


వివిధ దేశాల నుండి ఏపీ కి వచ్చిన వారిపై నిఘా కోసం అత్యంత సాంకేతికత పరిజ్ఞానం వినియోగించాము  -డీజీపీ 


దేశంలోనే మొదటిసారిగా హోం క్వారం టెన్ యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీ తో పర్యవేక్షించాము  -డీజీపీ 


22,478 మంది పై ఇరవై ఎనిమిది రోజులపాటు నిఘా ఏర్పాటు చేశాము-డీజీపీ 


జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేశాము-డీజీపీ 


*ఇరవై ఎనిమది రోజుల హోం క్వారంటెన్ పూర్తి కావడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగిస్తున్నాము -డీజీపీ*


యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై  నిఘా పెట్టాం -డీజీపీ 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాము -డీజీపీ 


*రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘాకోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో  మొబైలు యాప్ సిద్ధం చేస్తున్నాం -డీజీపీ*


విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖ కు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనం -డీజీపీ 


కరోనా కట్టడికి సహకరించిన వారికి సర్వదా రుణపడి ఉంటాము -డీజీపీ