ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే  మాంసాన్ని విక్రయించాలి

 


ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే  మాంసాన్ని విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కమిటీ కన్వీనర్ డాక్టర్ బాబు భేరి హెచ్చరించారు. సోమవారం దిలీసుఖ్ నగర్, చైతన్య పురి, బజార్ ఘాట్ తదితర ప్రాంతాల్లో ని సుమారు 11 మాంసం దుకాణాల లో తనిఖీలు నిర్వహించారు. మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మాంసం ధరల నియంత్రణ కు ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తనిఖీల లో లైసెన్స్ లేని, నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న 5 షాపులను మూసివేయించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా కిలో మటన్ 700 రూపాయలకు విక్రయించాలని, ధరలను తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని దుకాణాల నిర్వాహకులను ఆదేశించారు. కరోనా నేపధ్యంలో మాంసం కోసం వచ్చే ప్రజలు  కనీస దూరం పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల లో డాక్టర్లు ఖాద్రి, నిజాం, సుభాష్ తదితరులు ఉన్నారు.