సేవా కార్య‌క్ర‌మాల‌కు అండ‌గా ఉంటా

సేవా కార్య‌క్ర‌మాల‌కు అండ‌గా ఉంటా



చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని



500 మందికి అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ
నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ప్ర‌తి సేవా కార్య‌క్ర‌మానికి తాను అండ‌గా ఉంటాన‌ని చిల‌క‌లూపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. క‌రోనా వైర‌స్‌ వ్యాప్తిని అరిక‌ట్టే విధుల్లో ఉన్న ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ సిబ్బంది సుమారు 350 మందికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ఏకాంబ్రం సునీత ఆధ్వ‌ర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. ప‌ట్ట‌ణ పోలీస్‌స్టేష‌న్‌లో పంపిణీ కార్య‌క్ర‌మానికి చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స‌మాజానికి చేత‌నైన సాయం అందించే వాళ్లే దేవుళ్ల‌ని తెలిపారు. క‌రోనా వ్యాధిని అరిక‌ట్ట‌డం కోసం ఎంతో బాధ్య‌త‌తో పోలీసులు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు ప‌నిచేస్తున్నార‌ని, వీరంద‌రికీ అల్పాహారం అందించ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం