వై ఏస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ఏదులాబాద్ గ్రామ మహిళలకు సహాయం.


ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో చెందిన మహిళ కోటి ప్రభుత్వ హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చారు వారు ఇంటికి తిరిగి రావడంతో కరోనా వైరస్ ప్రభావం వలన వారిని వారి కుటుంబాన్ని గ్రామంలో తిరగకూడదని గృహ నిబంధన చేయడంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఆశ వర్కర్ ఘట్కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారికి విషయం తెలియజేయడంతో వెంటనే స్పందించి వైయస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా వారికి బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు వైయస్ రెడ్డి ట్రస్ట్ మండల సభ్యులు రమేష్ భానుచందర్ ఆశ వర్కర్ మహాలక్ష్మి చేతుల మీదగా వారికి అందజేసి ఇచ్చారు వారు వారి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడి ఎంపీపీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు