మానవత్వం చాటుతున్న మనం చారిటబుల్ ట్రస్ట్


ఎలమంచిలి, విశాఖపట్నం జిల్లా.


మానవత్వం చాటుతున్న మనం చారిటబుల్ ట్రస్ట్


      కరోనా వైరస్ విజృంభిస్తున్న నైవేద్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అంతకంతకు పెంచుతున్న ప్పటికీ మనం చారిటబుల్ ట్రస్ట్ వారి అన్నదాన కార్యక్రమాలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు కీర్తి శేషులు కిల్లాడి అప్పారావు గారి జ్ఞాపకార్ధం వారి భార్య  కిల్లాడి కుమారి గారి ఆర్ధిక సహాయం తో తయారు చేసిన  ఆహార పొట్లాలను  యలమంచిలి  ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉన్నటువంటి పేషెంట్స్ కి అలాగే ఎలమంచిలి చుట్టుపక్కల ఉన్న నిరాశ్రయులకు, రైల్వే స్టేషన్ దగ్గర గల నిరాశ్రయులకు  మరియు దగ్గర్లో ఉన్న రేగుపాలెం గ్రామంలో ఉన్న నిరాశ్రయులకు మరియు దార భోగాపురం దగ్గర ఉన్న కిడ్నీ పేషెంట్ లు మరియు నిరాశ్రయులకు భోజనం ప్యాకెట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ పండూరు సురేష్,ట్రస్ట్ సభ్యులు  రత్న  రాజు మాస్టారు, K. ఈశ్వరరావు, S. శ్రీరామ్, కొఠారి రామచంద్ర రావు ( హెరిటేజ్), తంగేటి సూర్య ప్రకాష్ S సతీశ్, తదితరులు పాల్గొన్నారు.